హైదరాబాద్, సెప్టెంబర్ 9: బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఐటీ రంగాన్ని తనదైన శైలిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన సత్కారం లభించింది. 49వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్కోచ్ సంస్థ ఆయనకు ప్రదానం చేసింది. ఈ జాతీయ అవార్డు అందుకున్న అనంతరం మంత్రి మాట్లాడుతూ... ప్రతీ ఇంటికీ అంతర్జాల సేవలను అందిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడానికి ఎంతో గర్వపడుతున్నానని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు నడిపిస్తామని ఆయన ప్రకటించారు.