హైదరాబాద్ సెప్టెంబర్ 8: దేశ, రాష్ట్రాల్లో కొంతమంది నాయకుల ఆగడాలే హద్దు మీరుతున్నాయంటే..వారితో పాటు కొంత మంది నాయకుల సుపుత్రుల ఆగడాలు అయితే మితిమీరుతున్నాయి. అధికారంలో ఉన్నామనే అహంతో అధికారాన్ని కల్పించిన ప్రజలపైనే కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. నిన్న హైదరాబాద్ మహా నగరం పరిధిలోని కూకట్ పల్లి కార్పోరేటర్ తనయుడు నది రోడ్డుపై వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లిలోని ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు రామకృష్ణ గౌడ్ తన స్నేహితులతో కలిసి భాగ్యనగర్ కాలనీలో మద్యం తాగేందుకు ఓ బార్ కు వచ్చాడు. అదే సమయంలో అక్కడికి హేమంత్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. అయితే ఆ సమయంలో అతను టిఫిన్ సెంటర్ కు వెళ్లడానికి కారు అడ్డుగా ఉంటె అన్నా కాస్త కారు అడ్డంగా తీయరా.. అని అన్నాడు. అంతే ఈ మాత్రం దానికి రామకృష్ణ గౌడ్ నన్నే కార్ అడ్డం తీయమంటావా..అంటూ తన స్నేహితుల తోని వారిపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్ బెయిల్ పై వారిని విడుదల చేశారు.