హైదరాబాద్ సెప్టెంబర్ 6 : మన ఇండస్ట్రీ ని శివ తరువాత అంత ఊపు ఊపిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ చిత్రానికి సెలబ్రిటీ ల నుండి సాదారణ ప్రేక్షకుని వరకు చాలా మంచి స్పందన లభించింది. మహేష్ బాబు, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇంకా బోలెడు సెలబ్రిటీ లు ఈ సినిమాని అభినందిస్తూనే ఉన్నారు, ఈ తాజాగా జాబితాలోకి అనుష్క శెట్టి కూడా చేరింది. “అర్జున్ రెడ్డి తప్పక చూడాల్సిన చిత్రం, సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ, శాలిని పాండే మరియు మొత్తం చిత్ర యూనిట్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు” తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు అనుష్క.