ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి...!

SMTV Desk 2017-09-04 11:57:53  khairathabad ganesh, laddu, venkayya nayudu,vice president, upa raashtrapathi venkayya

హైదరాబాద్ సెప్టెంబర్ 4: తెలుగు రాష్ట్రానికి చెందిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు ఉదయం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. అయితే ప్రతి ఏడాది వెంకయ్య ఉప రాష్ట్రపతి గణనాథున్ని దర్శించుకుంటున్నా ఉప రాష్ట్రపతి హోదాలో దర్శించుకోవడం ఇది మొదటి సారి కావడం తో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. గణేషుడి దర్శనం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, మన దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని మహా గణపతిని కోరుకున్నానని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా..ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉండేలా చేయాలని ప్రార్థించానన్నారు. వెంకయ్య తో పాటు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.