ముంబై, ఆగస్ట్ 30 : హిందీలో ప్రసారమవుతున్న "పహ్రేదార్ పియా కీ" సీరియల్ గురించి ప్రేక్షకుల నుండి వివాదాస్పద సమస్యలు తలెత్తడంతో ఈ సీరియల్ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు సోనీ టీవీ ప్రకటించింది. ఈ సీరియల్ లో 18 ఏళ్ల యువతి, 10 ఏళ్ల బాలుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఈ కథాంశంతో వచ్చిన సీరియల్ ప్రోమోలను చూసిన ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రేక్షకులు కథను అంగీకరించినా.. ఆ బాలుడు, యువతికి మధ్యలో వచ్చే కొన్ని హనీమూన్ సన్నివేశాలకు తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. ఈ సీరియల్ వల్ల పిల్లలపై, అటు సమాజంపై కూడా చెడు ప్రభావం పడుతుందంటూ ఇప్పటికే కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మొదట్లో సీరియల్ను నిలిపివేయడానికి యూనిట్ ఒప్పుకోలేదు కానీ సోనీ బృందం ఒత్తిడి చేయడంతో ఈ సీరియల్ ను నిలిపివేయడానికి అంగీకరించారు. ఈ సీరియల్ ను నిలిపివేసి మరో కొత్త కథాంశంతో వస్తామని నిర్మాత సుమిత్ మిట్టల్ తెలిపారు.