హైదరాబాద్ ఆగస్ట్ 27: హైదరాబాద్ సోమాజిగూడలో లలితా జ్యువలరీ 15వ షో రూమ్ ని అట్టహాసంగా ప్రారభించారు. తెలంగాణా మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. లలితా జ్యువలరీ సిఎండి కిరణ్ కుమార్ మాట్లాడుతూ..."ప్రపంచంలో అతిపెద్ద షో రూమ్ లో లలితా జ్యువలరీ ఒకటి, 100 శాతం తరుగు లేకుండా బంగారు నగలు కొనొచ్చు, ఈ షో రూమ్ లక్ష ముప్పై వేల చదరపు వేల అడుగులు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణా ప్రజల మధ్య ఇటువంటి షో రూమ్ అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. సోమాజిగూడ, లలితా జ్యువలరీ ప్రారంబోత్సవానికి పలువురు ప్రముఖులు, సినీతారలు, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, తెలంగాణామంత్రి కేటిఆర్, లైకా గ్రూప్ చైర్మన్, బండారు దత్తాత్రేయ, సినీ నటుడు గిరిబాబు, తదితరులు హాజరవ్వడంతో అక్కడి ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది.