హైదరాబాద్, ఆగస్ట్ 22: ఇటీవల హైదరాబాద్ నగరంలోని పలు మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేసి సీజ్ చేసిన సంగతి సుపరిచితమే. ఈ నేపధ్యంలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం జరుగుతున్న చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ముఖ్య పాత్రగా అనుమానిస్తున్న సిద్ధార్థ్ అనే వ్యక్తిని పోలీసులు విచారించగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల పేర్లతో పాటు పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు వెలుగులోకి వచ్చాయని సమాచారం. దీంతో ఇప్పుడిప్పుడే డ్రగ్స్ కేసు నుంచి కోలుకుంటున్న టాలీవుడ్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. సిద్ధార్థ్ తెలిపిన వివరాల ప్రకారం వీఐపీ కస్టమర్ల కోసం వెండితెరతో పాటు బుల్లితెరకు చెందిన అందమైన వారిని ఎంపిక చేసి సరఫరా చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన తెలిపిన పేర్లలో గతంలో వ్యభిచారం కేసులో అరెస్టయిన నటితో పాటు, వ్యాంప్ పాత్రలు చేసే మరో యువ నటి ఉండటం విశేషం. అయితే వీరికి పోలీసులు నోటీసులు పంపించనున్నట్లు సమాచారం.