విజయవాడ ఆగస్ట్ 17: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నంద్యాల ఉపఎన్నికల ఫై తీవ్ర విమర్శలు చేశారు ,ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయని విమర్శించారు.దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మారిందన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోక, రాష్ట్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు నంద్యాలలోనే తిష్ట వేశారని మండిపడ్డారు.అధికార పక్షానికి తామేమీ ఎక్కువకానట్టుగా ప్రతిపక్ష నేత కూడా పదిరోజులగా నంద్యాలలో తిష్టవేసి ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానంలో ఉపఎన్నిక సందర్భంగా డబ్బులు భారీగా ఖర్చు పెడుతున్నారన్న కారణంగా ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికను రద్దుచేసిందని.. అదేరకంగా నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలనీ ఏపీసీసీ అధ్యక్షుడు సూచించారు.