హైదరాబాద్ : నిజామాబాద్కు చెందిన రైతులు చివరికి హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు. నిజామాబాద్ ఎంపి ఎన్నికపై వారికి గుర్తులు ఎలా ఉంటాయో చెప్పలేదని, వాటిపై ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం లేనందున ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికను వాయిదా వేసి, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా రెండో విడతలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్పై మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది.