హైదరాబాద్ , ఆగస్ట్ 10: నగర శాంతి భద్రతల దృష్ట్యా పలు చోట్ల పోలీసులు సోదాలు జరుపుతున్నారు. పోలీసులు, నిఘా వర్గాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు సంయుక్తంగా 50 బృందాలుగా ఈ తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల పాస్పోర్టులు, వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా రాజేంద్రనగర్ పరిధి బండ్లగూడలో 100 మంది నైజిరియన్ల పాస్పోర్టులను అధికారులు పరిశీలించారు. వీసాలు లేని 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పశ్చిమ మండల పరిధిలోని ఆసిఫ్నగర్ డివిజన్లో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.