హైదరాబాద్/శంషాబాద్, మార్చ్ 10: హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయంలో బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు అక్రమంగా తరలిస్తున్న 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న సూడాన్ దేశస్థుడి దగ్గర అధికారులు తనిఖీలు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.