హైదరాబాద్, ఆగస్ట్ 6 : రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దారుణాలు అన్ని ఇన్ని కావు. ఒకసారి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి ఎలా వస్తారో అని తల్లిదండ్రులు భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ లో ఒక దారుణం చోటు చోటుచేసుకుంది. ఒక మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను ఇచ్చి ఆమెపై దుర్మార్గులు దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కాచిగుడలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక మహిళపై రెండురోజుల క్రితం గ్యాంగ్ రేప్ జరుగగా స్పృహలోకి వచ్చిన ఆమె నేరుగా కాచిగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.