హైదరాబాద్, మార్చి 5: ఈ నెల 13న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిజాంసాగర్ మండలానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేటీఆర్ రాక కొరకు, సభ నిర్వహణకు గాను సోమవారం నిజాంసాగర్ మండలం మాగి గ్రామశివారులో సభ స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్షిండే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తనయుడు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం ఏర్పాట్లు భారీగా చేస్తున్నామని చెప్పారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, నారాయణ్ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల నుండి 20వేల మంది ముఖ్యనేతలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, అసెంబ్లీ స్పీకర్ తనయుడు సురేందర్రెడ్డి, ఎంపీ పాటిల్, జిల్లా ప్రతినిధులు శంకర్ పటేల్, గంగాదర్, బాన్సువాడ డీఎస్పీ యాదగిరి మండల టీఆర్ఎస్ నాయకులు గైని విఠల్, దుర్గారెడ్డి, కమ్మరికత్త అంజయ్య, రమేష్గౌడ్, పీరని సాయిలు, వాజిద్ అలీ, మహేందర్, ఇప్తాకర్, కాంత్రెడ్డి, చింతకింది రాములు తదితరులు ఉన్నారు.