హైదరాబాద్, ఆగష్టు 4 : హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రచారాల్ని చేపట్టిన విషయం విదితమే. అయితే తాజాగా తెరాస ఎంపీ కవిత ఈ రాఖీ పండగ రోజున సోదరుడికి రాఖీతో పాటు హెల్మెట్ను కూడా బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు ఇటీవల తెలియజేసారు. ఈ ప్రచారంలో భాగంగా రూపొందించిన సిస్టర్4చేంజ్.ఆర్గ్ వెబ్సైట్ను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజాన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.. ఇందుకు గాను ఆమెకు కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. "సిస్టర్4చేంజ్ వెబ్సైట్ ప్రచారంలో భాగంగా తమ మద్దతు తెలిపి, వెబ్సైట్ను ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు" అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.