రూ.5కే భోజనం : స్వయంగా వడ్డించిన కేటీఆర్

SMTV Desk 2019-02-08 20:23:06  KTR, TRS, sirisilla, akshayapatra, rs 5 meals

సిరిసిల్ల, ఫిబ్రవరి 8: తెరాస ప్రధాన కార్యదర్శి కేటీఆర్ ఈరోజు తన నియోజకవర్గమైన సిరిసిల్ల పట్ణణంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రూ.5కే భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. అక్షయపాత్ర పేరిట జిల్లా కేంద్రంలో రూ.5కే భోజనపథకాన్ని ప్రవేశపెట్టారు.

అయితే భోజనం చేయడానికి వచ్చిన ప్రజలకు స్వయంగా కేటీఆర్ భోజనం వడ్డించడం విశేషం. కాగా తక్కువ ధరకే నాణ్యమైన భోజనం లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తరువాత కేటీఆర్ నెహ్రునరగ్ లోని వైకుంఠదామం, ఇందిరాపార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ లో ఓ పెన్ జిమ్ ని కూడా ప్రారంభించారు.