హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గాంధీ ఆసుపత్రికి గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ గుర్తింపు లభించింది. గంట వ్యవధిలో అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. 2018 సెప్టెంబర్ 24వ తేదీన గాంధీ ఆసుపత్రిలో గంట వ్యవధిలో 11,416 మందికి బీపీ రీడింగ్లు నమోదు చేశారు. ఈ పోటీ దేశంలో 37 కేంద్రాల్లో ఏకకాలంలో జరిగిన అత్యధికంగా బీపీ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆస్పత్రి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నట్టు ఫిబ్రవరి 1న జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. ఈ రికార్డు సాధించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేసారు.