ఆక్వా ఎక్స్‌పో 2019ను ప్రారంభించిన తలసాని

SMTV Desk 2019-01-31 17:58:19  Thalasani Srinivas Yadav, High Tech Exhibition Center, Aqua Expo 2019

హైదరాబాద్, జనవరి 31: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఆక్వా ఎక్స్‌పో 2019ను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ మత్స్యకారులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఫిష్‌ సీడ్‌ను ఉచితంగా ఇవ్వడంతో పాటు మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీతో వాహనాలను అందజేశామన్నారు. ఈ సంవత్సరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే నీరు పుష్కలంగా లభిస్తుందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ సూచనల ప్రకారం నీటి వనరులు ఎక్కువ ఉన్న చోట చేపలను పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఫిష్‌ సీడ్‌ పంపిణీ చేసినప్పటి నుంచి చేపలను మార్కెటింగ్‌ చేసుకునే దాకా అన్ని దశల్లో మత్స్యకారులకు అండగా ఉంటామని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.