హైదరాబాద్, జనవరి ౩౦: తెలంగాణలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ఈరోజు మొదలయ్యాయి. 29 జిల్లాల్లోని 3,529 గ్రామ పంచాయతీల్లో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 27,583 వార్డులకుగాను 67,316 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేంద్రలవద్ధ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వొంటిగంటకు పోలింగ్ పూర్తి కానుండగా, ఆపై సాయంత్రంలోగా ఓట్ల లెక్కింపును పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.