హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 10 మందికి ఎస్ఐలుగా పదోన్నతులు లభించాయి. బుధవారం పోలీసు కమీషనర్ అంజన్ కుమార్ ను తన కార్యలయంలో కలిసి తమ అధికార విధులపై చర్చించారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ పదోన్నతులు పొందిన వారు మరింత బాధ్యతగా పనిచేయాలని, పోలీసు శాఖ పేరు, ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని కోరారు. విధి నిర్వహణలో కచ్చితంగా వుండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని ఆయన కోరారు.