మంచిర్యాలలో ప్రభుత్వాధికారుల ఘరాన మోసం...

SMTV Desk 2019-01-10 15:37:48  Government officers, Pensions

మంచిర్యాల, జనవరి 10: జిల్లాలో ప్రభుత్వాధికారులు వృద్దులకు వచ్చే ఆసరా పెన్షన్లను కాజేస్తూ చివరికి అడ్డంగా దొరికిపోయారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల సొమ్మును కాజేసేందుకు అధికారులు పన్నాగం పన్నారు. చనిపోయిన వారి వేలిముద్రలు సేకరించి వాటి సాయంతో పెన్షన్ సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నాడు.

సుమారు మూడు, నాలుగేళ్లుగా పెన్షన్‌ సొమ్మును దోచుకుంటున్న వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.