హైదరాబాద్, జనవరి 4: రాష్ట్రంలో రైతుబందు చెక్కుల పంపిణీని ఎత్తి పరిస్థిలో ఆగకూడదని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రైతుబంధు చెక్కుల పంపిణీ కొనసాగిందని పేర్కొంది. చెక్కుల పంపిణీకి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. రైతుబంధు అమలు జరుగుతున్న పథకమని ప్రభుత్వం పేర్కొంది.