మహేశ్ బాకీ వసూల్ చేసిన జీఎస్టీ కమిషనరేట్..!

SMTV Desk 2018-12-30 11:31:29  Mahesh babu, GST Officers, IT Rides

హైదరాబాద్, డిసెంబర్ 30: సూపర్ స్టార్ మహేశ్ బాబు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని వసూలు చేశామని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. మహేశ్ మొత్తం రూ.73 లక్షలు కట్టాల్సివుండగా, గురువారం నాడు రూ.42 లక్షలను రికవరీ చేశామన్నారు. తాజాగా, ఆయన బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ. 31.47 లక్షలను ప్రభుత్వ ఖజానాకు జమ చేశామని, దీన్ని డీడీ రూపంలో ట్రెజరీ బ్యాంకుకు జమ చేశామని జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి.

సెప్టెంబర్ లో ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ స్టే ఇవ్వలేదని, వీటిని దృష్టిలో పెట్టుకునే తాము చర్యలకు దిగామని అధికారులు స్పష్టం చేశారు. 2010లోనే తాము ఆయనకు నోటీసులు ఇచ్చినా, స్పందించని కారణంగానే ఖాతాలను సీజ్ చేసి, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు చేసినట్టు పేర్కొన్నారు.