అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

SMTV Desk 2018-12-28 16:29:20  Rice , Illegal, Transport, Nagar kurnool

నాగర్‌ కర్నూల్, డిసెంబర్ 28: నగర సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండలం ఉల్సర్‌లో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వారికి లారీలో అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అచ్చంపేట నుండి కల్వకుర్తి రైస్‌ మిల్లుకు తరలిస్తుంటే పట్టుకున్నట్లు సమాచారం