హైదరాబాద్, డిసెంబర్ 25: నగరంలోని మౌలాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను మావోయిజం వైపు ఆకర్షించేందుకు జరగుతున్న ప్రయత్నాలు తెలుసుకోవడంతో సోమవారం రాత్రి పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. వీరంతా విశాఖ మన్యంలో పోలీసులపై దాడి చేసిన ఘటనల్లో నిందితులు కావడం విశేషం. కొర్రా కామేశ్వరరావు, అనూష , అన్నపూర్ణ , భవానిలను మౌలాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయిగూడలో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు అక్క చెళ్లెల్లు ఉండటం గమనార్హం. అయితే వీరంతా మావోయిస్టు అగ్రనేత ఆర్కే అడుగుజాడల్లో నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.