హైదరాబాద్, డిసెంబర్ 24: శుక్రవారం హైదరాబాద్ నగరానికి శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం కరీంనగర్ లో పర్యటించారు. ఈ రోజుతో విడిది పూర్తవ్వడంతో తిరిగి తన ప్రత్యేక విమానంలో హకీంపేట నుండి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నిన్న రాష్ట్రపతి నిలయంలో కోవింద్ ఇచ్చిన తేనీటి విందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్లోని రాష్ట్రపతి భవన్లో గడుపుతారు. ఈసారి పర్యటనలో భాగంగా డిసెంబర్ 21 నుంచి 24 వరకు ఆయన ఇక్కడ వున్నారు.