హైదరాబాద్, డిసెంబర్ 18: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిస్తోంది. దీని ధాటికి ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీత వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో శీతలగాలులు వీస్తున్నాయి. కాగా, తుఫాను కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళ, బుధవారాల్లో సీఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో నిర్మితమవుతున్న వివిధ వంతెనలు, పంప్హౌస్లను సందర్శించాల్సి వుంది.
అయితే తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో పర్యటనను వాయిదా వేస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన తేదీలను త్వరలో నిర్ణయిస్తారని సీఎంవో తెలియజేసింది.