తెరాస నేత మృతి...!

SMTV Desk 2018-12-15 11:50:58  Battula Ramulu, TRS Party

ఖమ్మం, డిసెంబర్ 15: టీఆర్ఎస్ సీనియర్ నేత బత్తుల రాములు (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు, చికిత్స పొందుతూ రాములు కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జగన్నాధపురం ఆయన స్వస్థలం. తెరాస స్థాపించినప్పటి నుంచి బత్తుల రాములు పార్టీ లోనే కొనసాగుతున్నారు. తన సొంత నియోజకవర్గంలోని గ్రామాల్లో టీఆర్ఎస్ ను పటిష్టం చేసేందుకు ఆయన అశేషమైన కృషి చేశారు.

రాములు మృతిపై తెరాస సహా పలు పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాములు కుటుంబాన్ని మాజీ మంత్రి తుమ్మల ఫోన్ లో పరామర్శించారు. అధైర్య పడొద్దనీ, పార్టీ అండగా ఉంటుందని రాములు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. పలువురు నాయకులు రాములు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.