నాలుగేళ్లలో దోచుకున్నదంతా కక్కిస్తా : వంటేరు

SMTV Desk 2018-12-08 15:18:52  KCR, Vnteru Prathap Reddy, Gajvel

గజ్వేల్, డిసెంబర్ 8: గజ్వేల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 వేల మెజార్టీతో తాను గెలవబోతున్నానని మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మనందరం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని విమర్శించారు. తెలంగాణాకి నిజమైన స్వాతంత్ర్యం ఈ నెల 11న వస్తుందని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారని ఆరోపించారు.

ప్రజలు చైతన్య వంతులని, నిజమైన ప్రజాస్వామ్యానికే ఓటు వేశారని చెప్పారు. నాలుగేళ్లుగా మూతపడ్డ సెక్రటేరియట్‌ను మళ్లీ తెరిపిస్తామన్నారు. ఈ నాలుగేళ్లలో దోచుకున్నదంతా కక్కిస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు.