హైదరాబాద్, జూలై 25 : డ్రగ్స్ దర్యాప్తు లో భాగంగా హీరోయిన్ ఛార్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది. దిని పై హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే మరుసటి రోజు కూడా విచారణ జరుపవచ్చని తీర్పునిచ్చింది. అడ్వొకేట్ సమక్షంలో విచారించాలన్న ఛార్మి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుమతి లేకుండా శాంపిల్స్ తీసుకోరాదని, మహిళా ఆఫీసర్లతో విచారణ చేపట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది.