భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయం చేయొద్దు :చంద్రబాబు

SMTV Desk 2018-12-03 17:41:40  chandrababu

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాంనగర్ లో నిర్వహించిన రోడ్ షో లో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు. అలా చేస్తే కుదరదు అని పరోక్షంగా తెరాస ని హెచ్చరించారు. తెలంగాణాలో అభివృద్ధి స్తంభించిపోయింది, అభివృద్ధి మాటల్లోనే కానీ ప్రజల వద్దకు చేరడంలేదని అన్నారు.

యువకులని ప్రోత్సహించేందుకే ఆయన హైదరాబాద్ వచ్చినట్లు తెలియజేసారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి అని ఆకాంక్షించిన చంద్రబాబు, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్దులని గెలిపించాలని కోరారు.