వైరల్ అవుతున్న చంద్రబాబు, కవిత ఫోటో....!

SMTV Desk 2018-12-03 13:08:56  Chandrababu,Kavitha

హైదరాబాద్,డిసెంబర్ 3 : వొక పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతోంది. ఆ ఫోటో వొకప్పుడు టిడిపి,టీఆర్ఎస్ పొత్తుపెట్టుకొని ఎన్నికల బరిలో దిగినప్పటిది. చంద్రబాబు నిజామాబాద్ ప్రాంతానికి ప్రచారానికి వెళ్లినపుడు, ఆయనతో పాటు కేసీఆర్ కుమార్తె కవిత కూడా ప్రచారంలో పాల్గొన్నారు అప్పటి ఫోటో అది.

ఈ ఫోటో చూపిస్తూ తెలుగు తమ్ముళ్ళు తెరాస పై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు పలు గ్రూపుల్లో వైరల్ అయ్యింది. మరి ఆనాడు అది ఆంధ్ర పార్టీ అని తెలియదా జతకట్టారు ? ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు జతకడితే నీతిమాలినోళ్ళు అవుతారా ? అని ప్రశ్నిస్తున్నారు.