కోర్టు తీర్పును డిజిపి పట్టించుకోరా? రేవంత్‌రెడ్డి

SMTV Desk 2018-12-01 13:31:42  revanth reddy, congress,Mahender Reddy,

హైదరాబాద్, డిసెంబర్ 01: తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తనకు భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో మళ్ళీ మరోసారి పిటిషన్ వేశారు. కొన్నిరోజుల క్రితం తాను హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు తనకు రక్షించాలని కల్పించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారని కానీ డీజీపీ మహేందర్‌రెడ్డి దానిని పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి తన పిటిషను ద్వారా న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. తనను హత్య చేయించి ఆ నేరాన్ని మావోయిస్టులపైకి నెట్టివేయాలని తెరాస కుట్రలు పన్నుతోందని, ఆ భయంతోనే తాను నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోతున్నానని రేవంత్‌రెడ్డి తన పిటిషనులో పేర్కొన్నారు. కనుక తనకు కేంద్రరక్షణదళాలకు చెందిన సిబ్బందితో రక్షణ కల్పించాలని రేవంత్‌రెడ్డి తన పిటిషనులో కోరారు. ఈ పిటిషనుపై హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం తరువాత విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.