తెరాసపై విశ్వేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

SMTV Desk 2018-12-01 12:56:44  trs, visheshawar reddy,

హైదరాబాద్, డిసెంబర్ 01: ఇటీవల హటాత్తుగా తెరాసకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వొక ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెరాసపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “గతంలో కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా బ్రతికిన నేను తెరాసలో చెరీ పనిచేయడం నాకు వొక చక్కటి గుణపాఠం నేర్పింది. తమిళనాడులో అన్నాడిఎంకె పార్టీలో నేతలు, మంత్రులు తాము అమ్మకు విధేయులమని నిరూపించుకొనేందుకు తమ చేతి మీద ‘అమ్మ పేరు పచ్చబొట్టు పొడిపించుకొంటారు. అలాగే తెరాసలో ఎక్కువ కాలం కొనసాగితే నేను కూడా కేసీఆర్‌, కేటిఆర్‌ పేర్లను పచ్చబొట్టు పొడిపించుకోవలసి వచ్చేది. తెరాసలో అవమానాలు భరించలేకనే పార్టీని వీడాను.

నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రంగారెడ్డి జిల్లాలో సగం మందికి ఎప్పటి నుంచో తెలుసు. కనుక రేవంత్‌రెడ్డికి తెలియడంలో విచిత్రమేమీ లేదు. మిగిలినవారెవరూ ముందుగా ఈవిషయాన్ని బహిర్గతం చేయలేదు ఆయన చేశారు. అంతే తేడా. ఈసారి ఎన్నికలలో తెరాసకు 100-110 సీట్లు వస్తాయని చెప్పుకొంటున్నారు కానీ 30 కంటే తక్కువ సీట్లే వస్తాయి,” అని అన్నారు.