హైదరాబాద్, నవంబర్ 23: ఇబ్రహింప్నం తెలుగు దేశం అభ్యర్ధి సామ రంగారెడ్డిపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అతని పై 420, 468,471 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాదాపూర్లో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసినట్లు ఆయనపై ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు . నాంపల్లి సబ్రిజిస్టార్ ఆఫీసులో ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ విషయం పై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది .