దేవరకొండ లో టిఆర్ఎస్ 'ప్రజా ఆశీర్వాద సభ'

SMTV Desk 2018-11-21 16:12:01  TRS, Devarakonda, praja asheerwada sabha

దేవరకొండ, నవంబర్ 21: తెరాస ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ అపద్దర్మ్మ ముఖ్యమంత్రి చంద్ర శేకర్ రావు నల్గొండ జిల్లా దేవరకొండ లో టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ను నిర్వహించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ "దేవరకొండలో టిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, దేవరకొండలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తాం అంటూ హామిలిచ్చారు. అలాగే సామజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు రావాలని, గిరిజనులకు రిజర్వేషన్ల పై ప్రధానికి అనేక సార్లు లేఖ రాశాను. గిరిజనులకి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత దేశ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోబోతున్నాం. కేంద్ర మీద ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని నాన్ కాంగ్రెస్, నాన్ బిజేపి ప్రభుత్వానికి కృషి చేస్తాం అని చెప్పుకొచ్చారు.

పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మల్లీ తెలంగాణ చీకట్లోకి వెళ్తుంది. చంద్రబాబు నాయకత్వం మనకెందుకు అని కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకుంటే మల్లీ ఆయనకి ఇస్తామా అంటూ ఆగ్రహించారు. తెలంగాణలో 14 స్థానాల్లో ఆయన పోటీ ఎందుకు..? చంద్రబాబు తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారు". అని బాబు తీవ్రంగా వ్యతిరేఖించారు.