తెరాస కండువా కప్పుకున్న కాంగ్రెస్ నేతలు

SMTV Desk 2018-11-21 15:16:56  TRS, Congress, thummeti sammireddy, paripati ravinder reddy

హైదరాబాద్, నవంబర్ 21: కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన వారిక పార్టీ నిరాశ మిగిల్చే సరికి పక్క పార్టీకి జారుకుంటున్నారు. అదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్‌ నేత పరిపాటి రవీందర్ రెడ్డి వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మంత్రి ఈటల సమక్షంలో మంగళవారం తెరాసలో చేరిపోయారు. వారిరువురూ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలనుకొన్నారు. కానీ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తికి గురైన ఆ ఇద్దరు సీనియర్ నేతలు తెరాసలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇచ్చారు. మరో రెండు వారాలలో పోలింగ్ జరుగబోతుండగా వొకే నియోజకవర్గం నుంచి ఇద్దరు సీనియర్ నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దేబ్బే అని చెప్పవచ్చు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనల్లుడు పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ నుంచి టికెట్ లభించింది. ఆ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్ధిగా మంత్రి ఈటల రాజేందర్, బిజెపి అభ్యర్ధిగా పుప్పల రఘు పోటీ చేస్తున్నారు.