గజ్వేల్, నవంబర్ 18: ప్రముఖ జానపద గాయకుడు గద్దర్ ఇంతకుముంది గజ్వేల్ లో పోటీచేస్తారని సర్వత్రా చర్చజరిగింది…కానీ శనివారం రాత్రి ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. సేవ్ నేషన్, సేవ్ కన్ స్టిట్యూషన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా తాను ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
దేశం కోసం మరో ఉద్యమాన్ని తాను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి కేంద్రం పై పోరాటానికి సిద్ధమైనందుకు తాను సంతోషం వ్యక్తం చేశారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారెవ్వరైనా సరే వారితో కలిసి ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు. నాడు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఫలాలు ప్రజలకు అందలేదంటూ ఆయన పేర్కొన్నారు