హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎట్టకేలకు టిజేఎస్ ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. మిగతా నాలుగు స్థానాలకు రేపు అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించింది. బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తుండడంతో జాబితాలు ఆలస్యమయ్యాయని వివరింది. తొలి అభ్యర్థుల జాబితాలో పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం పేరు లేకపోవడం గమన్హారం.
మెదక్ : జనార్దన్ రెడ్డి
మల్కాజ్గిరి : కపిలవాయి దిలీప్ కార్
దుబ్బాక : చిందం రాజ్కుమార్
సిద్దిపేట : భవానీ రెడ్డి
పైన పేర్కొన్న స్థానాల్లో అభ్యర్థులపై ముందునుంచీ స్పష్టత ఉంది. మహాకూటమి టీజేఎస్ 8 స్థానాలు కేటాయించగా, తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ ప్రకటించడం తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతలతో చర్చుల తర్వాత 8 సీట్లలోనే పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నామినేషన్ల గడువు సోమవారంతో ముగుస్తుండడంతో విధిలేక 8 సీట్లకు వొప్పుకున్నామని నేతలు అంటున్నారు.