కాశ్మీర్‍ను వదులుకునే ప్రసక్తే లేదు: వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-07-23 17:42:10  venkaiah naidu, pakistan, war, kashmir, kargil

మంత్రి వెంకయ్య నాయుడు పాకిస్తాన్ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పాకిస్థాన్ తన ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని మార్చుకుందని ఆయన మండిపడ్డారు. ఆయన ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన ‘కార్గిల్ పరాక్రమ పరేడ్’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్థాన్, 1971లో జరిగిన యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా పాక్ కు ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా భారత్ లో కాశ్మీర్ భాగమని, వదులుకునే ప్రసక్తే లేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు