ముద్రగడకు వ్యతిరేకంగా మౌనదీక్ష

SMTV Desk 2017-07-23 15:27:55  mudragada, reservations, tdp, kapu,jagan

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడి ఎక్కుతున్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కానీ, ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్దమవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ విజయవాడలో ముద్రగడకు వ్యతిరేకంగా మౌనదీక్ష చేయనున్నారు. ఇందులో కాపు కార్పొరేషన్ ద్వారా లబ్దిపొందినవారు పాల్గొంటారని, ముద్రగడ కాపు అభివృద్దికి దోహదపడకుండా జగన్ కు భజన చేస్తున్నారని, కాపుల కోసం ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు ఖర్చు చేస్తోందని త్వరలో కాపులకు రిజర్వేషన్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని అయన అన్నారు.