హైదరాబాద్, నవంబర్ 1: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ నేడు రెండవ జాబితాతో డిల్లీ వెళ్లబోతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ బిజెపి ఇప్పటికే శాసనసభ ఎన్నికలకు 38 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. కాగా రెండు రోజుల్లోగా మరికొంతమంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. ఎన్నికలకు కేవలం 37 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కేంద్రమంత్రులు, బిజెపి జాతీయ నేతలు కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారు కనుక అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా వారి పర్యటన షెడ్యూల్స్ కూడా ఖారరయ్యే అవకాశం ఉంది.