హైదరాబాద్, అక్టోబర్ 31: నగరంలోని మాదాపూర్ గ్లోబల్ పాఠశాలకు చెందిన బస్సు మంగళవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో మణికొండలో వొక విద్యార్థిని దించి వస్తుండగా నార్సింగ్ వైపు నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న రెడీమిక్స్ లారీ వన్మోర్నగర్ చౌరస్తా వద్ద నార్సింగ్ వైపు తిప్పుతున్న క్రమంలో అదుపుతప్పిన లారి ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడింది.
పదో తరగతి చదువుతున్న కోకాపేట రాజపుష్ప అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రతిభ, క్లీనర్ ఆనంద్కు స్వల్పంగా గాయాలయ్యాయి. డ్రైవర్ ఆంజనేయులు ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో విద్యార్థులు బస్సులో లేకపోడంతో పెను ప్రమాదం తప్పింది. రెడీమిక్స్ లారీ స్పీడ్గా వచ్చి ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడిందని డ్రైవర్ ఆంజనేయులు తెలిపాడు.