హైదరాబాద్, అక్టోబర్ 29: నగరంలోని కూకట్ పల్లి ప్రాంగణంలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ కళాశాల వాహనం వొక యువతిని ఢీ కొట్టడంతో ఆ యువతి అక్కడిక్కక్కడే మృతి చెందింది.
ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దానికి ప్రముఖ కళాశాల యాజమాన్యం ఆ యువతికి న్యాయం చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు .
కాలేజీకి చెందిన పలు బస్సులను ధ్వంసం చేశారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. బస్సును రోడ్డు పైనే ఆపేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.