హైదరాబాద్, అక్టోబర్ 27: టిడిపి సీనియర్ నేత పెద్దిరెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తుందని ఆయన మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా ప్రతిపక్ష నేతలు భయపడాల్సి వస్తుందని, వొక్కో నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ రూ.10 కోట్లు పంపిదని విమర్శించారు. తనకిష్టం లేని ప్రభుత్వాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని పెద్దిరెడ్డి విమర్శించారు. అలాగే తెలంగాణలో రాష్ట్రపతి పాలన తీసుకురావలని కోరారు.