సిద్ధిపేట ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి

SMTV Desk 2018-10-27 16:18:39  harish rao, trs, telangana elections

సిద్ధిపేట, అక్టోబర్ 27: తెలంగాణలో రాబోతున్న ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ నేతలు ప్రచారంలో చాలా బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తెరాస మాజీ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్‌ దీవెనలతో సిద్ధిపేటలో ఆలయాలు, మసీదులు, దర్గాలు అభివృద్ధి చేసుకున్నామని, రూ.250కోట్లతో చేపట్టిన డ్రైనేజీ పనులు పూర్తయితే పరిశుభ్ర సిద్ధిపేట తయారవుతుందన్నారు. 6 నెలల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పూర్తి చేసి సిద్ధిపేటను శుద్ధిపేటగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అన్ని రంగాల్లోసిద్ధిపేటను అభివృద్ధి చేసుకున్నామని, తెలంగాణకే తలమానికమైన అధునాతన ధోబీఘాట్‌ను నిర్మించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, 10 పడకల ఉచిత డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే ఏ ఇంటికి వెళ్లినా తెరాస నేతలను ప్రజలు స్వాగతిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.