ప్రతిపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బల్కా సుమన్

SMTV Desk 2018-10-26 18:19:21  mp, balka suman, trs, congress, uttam kumar reddy, kcr

తెలంగాణ, అక్టోబర్ 26: తెలంగాణ ఎంపీ బల్కా సుమన్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. గతంలో 6గంటలు కూడా కరెంటు ఉండేది కాదు ఇప్పుడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారని నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. మీకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కరెంట్ తీగ పట్టుకుంటే అర్ధమవుతుందని వెల్లడించారు. చీము నెత్తురు ఉంటే పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్ర పాలన బాగుందని ఎలా అంటారని ప్రశ్నించారు. డబ్బు ఆశతోనే కాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో పొత్తుకు సై అన్నారని విమర్శించారు. తెలంగాణ నలుమూలల కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇది ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదన్నారు. రైతుల కళ్ళలో కేసీఆర్ ఆనందం చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కుటుంబ పాలన సాగుతోందని వివరించారు. గాంధీ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి చాలా తేడా ఉందన్నారు. కేసీఆర్ ది ఉద్యమ కుటుంబం, ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసే కుటుంబమని సుమన్ తెలిపారు.