అధికార పక్ష పార్టీపై మండిపడ్డ ప్రొ. కోదండరాం

SMTV Desk 2018-10-25 13:43:06  RULING PARTY,PROF. KODANDARAM, ALLEGATIONS

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అధికార పక్ష పార్టీపై మండిపడ్డారు. తాజాగా మీడియా తో మాట్లాడుతో విచ్చలవిడిగా తమ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, రాష్ట్రంలో అత్యాధునిక ఫోన్ ట్యాపింగ్ యంత్రాలు వున్నాయని అన్నారు. వాట్సాప్‌ కాల్‌ను ట్యాప్‌ చేసి వినే సదుపాయం కూడా వారు కల్పించుకున్నారని, ప్రత్యక్షంగా ఇంటిలిజెన్స్ అధికారులే చెబుతున్నారు అని వెల్లడించారు.

ముఖ్యమైన విషయాలు ఫోన్‌లో మాట్లాడొద్దని సూచిస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చాక అందరిమీదా ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుల వాహనాలే సోదా చేస్తున్నారని, అధికార పక్షం వాహనాలనూ సోదా చేయాలని ఖండించారు.