తెలంగాణలో బీజేపి అధికారమే తన లక్ష్యం

SMTV Desk 2018-10-24 19:29:26  SWAMY PARIPURNANANDA, BJP,

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా బేజెపీని అధికారంలోకి రప్పించడానికి తన శాయశక్తుల శ్రమిస్తానని నేటి నుండి తను అదే పని గా చేసుకుంటాడని స్వామి పరిపుర్ణానంద తెలిపారు. ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో సమావేశం అయిన తర్వాత, బుధవారం హైదరాబాద్ చేరుకున్న స్వామీజీ మొదట చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.

అక్కడ ఆయన పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్సి మురళీధరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. "రాజకీయాల్లోకి రావాలంటే ఫాదర్ అన్నా ఉండాలి గాడ్ ఫాదర్ అన్నా ఉండాలి, నాకు దేవుడు తప్పు ఎవరూ దిక్కులేరని" స్వామిజీచెప్పారు.

గత 25 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై పోరాడాను అని, మారుమూల ప్రాంతాల్లో పర్యటించానని అక్కడి ప్రజల జీవన స్ధితిగతులు పరిశీలించానని, వారి జీవితాలు బాగుచేయాలంటే రాజకీయాల్లోకి రావటం