హైదరాబాద్, అక్టోబర్ 24: కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల పాటు తెలంగాణాలో పర్యటించి, తాజాగా హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు సంతృప్తికరంగా వున్నాయని చెప్పింది. అలాగే ఎన్నికల ప్రక్రియలో కొన్ని మార్పులు చెయ్యాలని అంతేకాక వివిధ పార్టీల నుండి వినతులు వొచ్చాయని పేర్కొంది.దీంతోపాటు ఓటర్ల సంఖ్య జాబితాపై కూడా ఆరోపణలు వచ్చాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం అని వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను స్వీకరించామని ఆయన తెలిపారు.