ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి కుంతియాను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం కలిశారు. తనకు ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాములు నాయక్ కోరుతున్నట్టు సమాచారం.
ఈ మేరకు హామీ రాగానే.. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముంది.అయితే, రాములు నాయక్ పార్టీ మారబోతున్నారన్న సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు బుజ్జిగింపు చర్యలు చేపట్టారు. కానీ, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని, తన అభ్యర్థనను సీఎం కేసీఆర్ ముందు ఉంచినా.. తనకు నారాయణఖేడ్ టిక్కెట్ కేటాయించకపోవడం తనను తీవ్రంగా బాధించిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ చెప్పారు.